పాలకొండ నియోజకవర్గంలో పృధ్వీరాజ్ పర్యటన

పాలకొండ నియోజకవర్గం: జనసేన పార్టీ తరపున ప్రచారానికి విచ్చేసిన సీనియర్ సినీ నటులు జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ పృద్విరాజ్ పర్యటనలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రజలకు, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నిమ్మక జయకృష్ణని గెలిపించవలసిందిగా కోరిన పృథ్వీరాజ్, గర్భాన సత్తిబాబు. అనంతరం స్థానిక 8వ వార్డు వడమలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి వీధి వీధి తిరిగిన ఆయన ప్రతి ఇంటిని సందర్శించి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేసి పాలకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఈ పర్యటనలో పృథ్వీరాజ్ తో పాటుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గర్భాన సత్తిబాబు పాల్గొని ఒటర్ మహాశయులను అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *