ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చిందని విజయనగరం జిల్లా పార్టీ నాయకులు తెలియజేశారు. నేతలు గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మర్రాపు సురేష్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెలమ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.మిడతాన రవి కుమార్, పార్వతీపురం ఇంచార్జి మోహన్ ఆదాడ, చీపురుపల్లి ఇంచార్జి విసినిగిరి శ్రీను అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి, ఇప్పుడు మన ప్రభుత్వం హయాంలో జరుగుతున్న ఎన్నికలలో కూటమి మద్దతు ఇస్తున్న పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Share this content:
Post Comment