సూళ్లూరుపేటలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: ఆవుల రమణ

సూళ్లూరుపేట, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజక ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్ ప్రోత్సాహంతో సూళ్లూరుపేట మండలం అధ్యక్షుడు ఆవుల రమణ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామస్థాయి నుండి మండలం వరకు ముఖ్య నాయకులను నూతన కమిటీ వేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆవుల రమణ మాట్లాడుతూ మండలం గ్రామాల ప్రజా సమస్యలపై పోరాడి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పలు సమస్యలు ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో జనసేన ఎప్పటికప్పుడు గమనిస్తూ.. పేద ప్రజలకు అండగా ఉంటుందని, మన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ తన ఆడంబరమైన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల సేవకై తిరుగుతున్నారని మనము మన నాయకుడి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి.. అందుకు మనము ప్రజలలో మమేకమై కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వల్లూరు కిరణ్, శ్రీహారికోట జగదీష్, నెల్లూరు చంద్రశేఖర్, తిపలపూడి రమణ తదితరులు పాల్గొన్నారు.