పోతురాజు సత్యనారాయణకు నివాళులు అర్పించిన జనసేన

రాజోలు నియోజకవర్గం, కేశవదాసుపాలెం గ్రామం, కాలవ మొగ సెంటర్లో పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ 81 జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేసిన వారి కుమారులు పోతురాజు వెంకన్నబాబు, నాగన్నబాబు, లక్ష్మీనారాయణ(లచ్చుకొండ). ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడిది సరోజ, ఎంపీటీసీ ఉండపల్లి సాయికుమారి అంజి, చోప్పల బాబురావు మరియు అంతర్వేది కర గ్రామ ప్రజలు, కేశవదాసుపాలెం గ్రామ ప్రజలు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.