విద్యుత్ ప్రమాదాలపై జనసేన వినతి పత్రం

నెల్లిమర్ల నియోజకవర్గం, పూసపాటిరేగ మండలంలో గత కొద్ది రోజులుగా విద్యుత్ ప్రమాదాల వలన చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా జరగడానికి సామాన్య ప్రజల అవగాహన లోపంతో పాటూ విద్యుత్ శాఖ వారి మరమ్మతుల ఆలస్యం కూడా ప్రధాన కారణమని భావించి జనసేన మండల కార్యవర్గం స్థానిక కొప్పెర్లలోని విద్యుత్ ఉపకేంద్రంలోని అసిస్టెంట్ ఇంజినీర్ కు సమస్యల తక్షణ పరిష్కారానికి వినతి పత్రం అందించారు. దీనిపై ఎఈ స్పందించి వెంటనే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, రాష్ట్ర మత్సకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు, సీనియర్ నేతలు బూర్లె విజయశంకర్, మాదేటి ఈశ్వర్రావు, జానకీరామ్, దుక్క అప్పలరాజు, పిన్నింటి అప్పలనాయుడు, ప్రమోద్, స్మార్ట్ రమేష్, రాలి రమణ, అల్లాడ వంశీ కృష్ణ, సతీష్, అడ్డగర్ల హరి, కె సిద్దు, నూకరాజు, వెంకటేష్, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.