వావిలపల్లి రోడ్డు దుస్థితిపై జనసేన వినతిపత్రం

మునుగోడు నియోజకవర్గం, నారాయణపురం మండలం నుంచి వావిలపల్లి రోడ్డు ధ్వంసమై 7 ఏళ్ళు గడుస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఎన్నికల కోసం తాత్కాలిక రోడ్ల నిర్మాణాలతో సరిపెడుతుంది. అధ్వానంగా మారిన రోడ్డు దుమ్ము, ధూళితో ప్రయాణికుల అవస్థలు, కంకర రాళ్లు ఎగిరిపడి వాహనదారులు గాయాలపాలవుతుండడంతో జనసేన ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ కో ఆర్డినెటర్ గోకుల రవీందర్ రెడ్డి ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజుబద్రి, కిరణ్, శ్రీకాంత్, చంద్రకాంత్, సాయి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.