పాలకొండ మండల పరిషత్ అధికారికి జనసేన వినతిపత్రం

పాలకొండ, మండల పరిషత్ అధికారి డొంక త్రినాథ్ ని, పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు కలిసి పాలకొండ మండలంలో ఉన్న వివిధ సమస్యలతో పాటు పరిసర ప్రాంతాల్లో డెంగ్యూ సమస్యలతో ప్రజలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డెంగ్యూ వ్యాధి నుండి ప్రజలను రక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని మరియు కాలువలు పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేయడం జరిగింది. మండల పరిషత్ అధికారి (ఎం.పి.డి.ఓ) సానుకూలంగా స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డొంక శివ ప్రసాద్, మిడితాన ప్రసాద్, గర్భాపు నరేంద్ర, పెనుగొండ రాజశేఖర్, డోంపాక సాయి కుమార్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.