పెదపూడి మండల ఎమ్మార్వోకి జనసేన వినతిపత్రం

అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెదపూడి మండలం కౌలు రైతులు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు సంబంధించి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి జనసేన పార్టీ ద్వారా నిరసన కార్యక్రమం చేసి రైతులకు స్పందన, జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని పెదపూడి మండల ఎమ్మార్వోకి వినతిపత్రం రైతుల ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో నాగు, మండల అధ్యక్షులు వీరాస్వామి జనసేన సంపర ఎంపీటీసీ, కాశీ రాణి మండల అధ్యక్షులు, నాయకులు, పెదపూడి గ్రామ జనసైనికులు, మండల జనసైనికులు, నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.