పెనుకొండ ఎమ్మెల్యేకి సమస్యలపై వినతిపత్రమిచ్చిన జనసేన
పెనుకొండ, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగా పెనుకొండ మండలం రాంపురం పంచాయతీ కొండంపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే శంకర్ నారాయణకి జనసేన పార్టీ నాయకులు గ్రామంలో ఉన్న ప్రత్యేక సమస్యలు డ్రైనేజీ, త్రాగు నీళ్లు, సీసీ రోడ్ల, సమస్యలు మరియు మరిముఖ్యంగా రోడ్లలో ఎక్కడంటే అక్కడ నీళ్లు ఉండడంతో దోమలు కుట్టి విషపూరిత జ్వరాలు వల్ల చాలా మంది ఆస్పత్రి పాలవుతున్నారు కాబట్టి వెంటనే బ్లీచింగ్ చేయించి డ్రైనేజీలు బాగు చేయాలని సమస్యలు వివరించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కుమార్, రాజేష్ నాయకులు బంగారం, హరినాయక్, శ్రీనివాస్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-13-at-17.55.25-1024x768.jpeg)