జనసేన పోరుబాట 12 వ రోజు పాదయాత్ర

  • ప్రజా సమస్యలపై పోరుబాటలో రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, స్ధానిక 6 వ డివిజన్ లోని మాదేపల్లి రోడ్ లో మొండేలు కాలనీ, ఇందిరమ్మ కాలనీ ఏరియాలో 12 వ రోజు ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా ఏలూరు సిటీ వైడ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు ఆధ్వర్యంలో పాదయాత్రను నిర్వహించిన రెడ్డి అప్పల నాయుడు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మాదేపల్లి రోడ్ ఇరువైపులా ఉన్న నిర్వాసితులకు సరైన మంచినీటి సదుపాయం కల్పించలేకపోతున్నారని స్థానికంగా ప్రజలు వాపోతున్నారు. అలాగే అర్హులైన వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయకపోవడం అధికార పార్టీ కార్పొరేటర్ కీ ఎన్ని సార్లు విన్నవించుకున్న పట్టించుకోకపోవడం కేవలం తమ తమ స్వార్థం కోసం పదవిని ఉపయోగించుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అని స్థానిక నాయకులపై రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు. ఏలూరు నియోజకవర్గ ప్రజలు వైసిపి మీద ఉన్న నమ్మకంతో ఆళ్ళనాని కి ఓట్లు వేసి గెలిపించనందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని గెలిచిన ఈ మూడేళ్లలో కనీసం ప్రజల వద్దకు వెళ్ళిన దాఖలాలు లేవని కరోనా కష్ట కాల సమయంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కరోనా బారిన పడిన ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని కేవలం శంకుస్థాపనలకు పరిమితమైన అభివృద్ధి పనులు మాత్రమే చేయగలిగారని రెడ్డి అప్పల నాయుడు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు స్థానిక నాయకులు పి.రాము, నూకరాజు, డి.దుర్గ, ఆర్ గణేష్, ఆర్ సాయి, చిన్న, వంశీ, చంటి, రామ్, లక్ష్మణ్, పి దేవా, పి రాజు, పి.జితేంద్ర, ఉపేంద్ర, లోకేష్, యు పవన్, బి.ఉదయ్, ఆర్.మోహన్, ఆర్ పెద్దసాయి, పి రమేష్, కె వెంకటేష్, ఎన్ వెంకటేష్, రాము, బి మహేష్, బి నవీన్, ఎమ్ సాయి, రాజేష్, బొద్దపు గోవిందు మరియు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.