48వ డివిజన్లో జనం కోసం జనసేన

నెల్లూరు: నగరంలోని స్థానిక 48వ డివిజన్ కుక్కలగుంట రాజేంద్రనగర్ ప్రాంతంలో నెల్లూరు జనసేన నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ప్రతి ఇంటికి తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేస్తూ, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో జనసేనను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆలియా, డివిజన్ ఇంచార్జ్ సురేష్, కంతర్, సాయి మోహన్, సుభాని, పవన్, రేవంత్, సౌమ్య, మల్లీశ్వరి, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.