పాడేరు నియోజకవర్గంలో జనంకోసం జనసేన కార్యక్రమం

విశాఖ జిల్లా జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం, జీ. మాడుగుల మండలం, కొరపల్లి పంచాయతీ, రూడుబయలు, గ్రామంలో జనంకోసం జనసేన అనే నినాదంతో డా.వంపూరు గంగులయ్య పర్యటించారు. శ్రీ గంగులయ్య మాట్లాడుతూ ఆదేశాలు ప్రజలు మంచి నీరు సదుపాయం లేక అల్లాడిపోతున్నారు కలుషిత నీరు తాగి అనారోగ్యానికి గురి అవ్వుతున్నారు , అలాగే గ్రామంలో రోడ్ సదుపాయం కూడా సరిగా లేదు తెలిపారు. శ్రీ గంగులయ్య మాట్లాడుతూ గ్రామంలో గర్భిణీ స్త్రీలు, అలాగే గ్రామంలో ఒక పాము కాటువేసిన తక్షణమే అంబులెన్స్ గ్రామంలోకి రాలేక రోడ్లు లేక చాలా ఇబ్బందులుకు గురి అవ్వుతున్నారు. అలాగే గ్రామంలో పిల్లలు చదువుకోవడానికి కనీసం అంగనివాడి సెంటర్స్ కూడా లేవు. వైసీపీ గవర్నమెంట్ తక్షణమే స్పందించి బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలనిజనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఆలాగే బాధితులకు ఆ గ్రామస్తులకు పెద్దలకు అందరికి న్యాయం జరిగేవరకు జనసేన పార్టీ అండగా ఉంటాదని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు జీ. మాడుగుల మండల నాయకులు మసాడి. సింహాచలం, ex. ఎంపీటీసీ, పాడేరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళి కృష్ణ, పి. ప్రసాద్, రాజు, చంద్ర, జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు. అనిల్ కుమార్, వెంకట రమణ sfi, గ్రామస్తులు, రాజారావు, లక్మయ్య, బొజ్జయ్య, కొండబాబు, చిన్న చిన్న బంగారయ్య, పి సింహాచలం, అప్పన్న, చిన్నతల్లి గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు.