బొబ్బిలి- పార్వతీపురం ప్రధాన రహదారి దుస్థితిపై జనసేన నిరసన

బొబ్బిలి నియోజకవర్గం: స్వామివారివీధి-సాయినగర్ జంక్షన్ వద్ద, బొబ్బిలి- పార్వతీపురం ప్రధాన రహదారిపై భారీ స్థాయిలో గొయ్య ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా ఉండడంతో.. సమస్యపై స్పందించిన జనసేననాయకులు వెంటనే ఆ గొయ్యను కప్పి, ప్రజలకు రక్షణ కల్పించవలసిందిగా జనసైనికులు డిమాండ్ చేశారు.. రెండు రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే.. భారీ స్థాయిలో ఆందోళన చేపడుతామని ప్రభుత్వ అధికారులకు హెచ్చరించారు.