విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన నిరసన
తణుకు, జనసేనపార్టీ ఆదేశాలు మేరకు పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణమే తగ్గించాలంటూ తణుకు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో జనసేన తరపున తణుకు పాలిటెక్నిక్ కళాశాల నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నరేంద్ర సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఈ వైఎస్సార్సీపి ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి జనాలను ఇబ్బంది పెట్టడం కాక మళ్ళీ అన్యాయంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం పుండు మీద కారం చల్లడమే అంటూ జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో తణుకు, అత్తిలి, ఇరగవరం, టౌన్ అధ్యక్షులు మరియు జనసైనికులు, కార్యకర్తలు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-04-at-6.22.12-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-04-at-6.22.11-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-04-at-6.22.10-PM-1024x576.jpeg)