11న కరెంట్ ఛార్జిలు మోత… విద్యుత్ కోత పై జనసేన నిరసన

*అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు

కోనసీమ జిల్లా ఈనెల 11 సోమవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఛార్జిలు మోత- కరెంటు కోత పై నిరసన కార్య క్రమం నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు తెలిపారు. ఉదయం 9గంటలకు అమలాపురం గడియార స్తంభం సెంటర్ నుండి ఈదరపల్లి వంతెన సమీపంలో గల విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ నిరసన కార్య క్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, వీరమహిళలు, నాయకులు, పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు.