మున్సిపల్ అధికారులు తీరుపై జనసేన నిరసన

అమలాపురం: ఖాళీ స్థలాలు, ఇంటి పన్నులు బకాయి పడితే ముసిపల్ అధికారులు ప్రవర్తిస్తున్న తీరు పురపాలక ప్రజలను నివ్వెర పరుస్తుందని జనసేన నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్ అభిప్రాయ పడ్డారు. ఎవరైనా పన్ను బాకాయిదారులు ఉంటే వారికి ముందస్తు నోటీసులు జారీ చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఏకంగా ఆయా స్థలాలను స్వాధీన పరచుకుంటాం అంటూ బోర్డులు ప్రదర్శించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విధమైన బెదిరింపులు ఆపాలని జనసేన నాయకులు అమలాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ళ సతీష్, కంచిపల్లి అబ్బులు, ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమా మహేశ్వర రావు, ఉండ్రు భగవాన్ దాసు, లింగోలు పండు, బట్టు పండు, పోలిశెట్టి బాబులు, వాకపల్లి వేంకటేశ్వర రావు, నల్లా వేంకటేశ్వర రావు, గంధం శ్రీను, కేశవ, గంగాబత్తుల కిషోర్, కంకిపాటి గోపి, పిల్లా రవి, వీర మహిళలు తిక్కా సరస్వతి, చాట్ల మంగతాయారు, వానపల్లి దేవి, కారటం వాణి, బొరుసు సూర్య కుమారి మరియు జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.