కరెంటు చార్జీలు తగ్గించాలని తూర్పుగోదావరి జనసేన నిరసన

తూర్పుగోదావరి జిల్లా, వైసీపీ ప్రభుత్వం కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా నష్టం పోయేల తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ లో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జ్ లు ఉభయగోదావరి జిల్లాల వీర మహిళా విభాగం కో ఆర్డినేటర్లు రాష్ట్ర నాయకులు జనసేన నాయకుల జిల్లా కార్యవర్గ సభ్యులు మండల ప్రెసిడెంట్ లు మండల కమిటీ సభ్యులు జనసైనికులు వీర మహిళలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.