జనసేన ప్రజా ఆశీర్వాద యాత్ర

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట టౌన్ పరిధిలోని బైపాస్ రోడ్డు వద్ద గురువారం జనసేన పార్టీ శాసనసభ అభ్యర్థి ఎం.వెంకటేశ్వరరావు(ఎం వి ఆర్) ఆధ్వర్యంలో జనసేన ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా పలు దుకాణ యజమానులను కలిసి కరపత్రాలను అందజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా కలిసి శాసనసభ ఎన్నికలలో పోటీలో ఉన్న కారణంగా ప్రజలందరిని ఆశీర్వదించి ఓట్లు వేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ అభ్యర్థిగా ఎం.వి.ఆర్ పార్టీ తరఫున గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బి గారి గోపాల్, శ్రీనివాసులు, మురళి, దినకర బాబు, మాదం సుబ్రహ్మణ్యం, కొట్టే వెంకట రాజేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.