రెడ్డిగూడెం మండలంలో జనసేన రచ్చబండ
రెడ్డిగూడెం మండల అధ్యక్షుడు చాపలమడుగు కాంతారావు ఆధ్వర్యంలో రెడ్డిగూడెం మండలంలోని రుద్రవరం, కుదప, కూనపరాజు పర్వ, మద్దులపర్వ గ్రామాలలో జనసేన రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ) మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యవర్గ సభ్యులు చింతల లక్ష్మీ, మైలవారం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అక్కల గాంధీ ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఆ సమస్యలని పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్తామని అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎక్కువగా గ్రామాల్లో ప్రజలు నీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రయినేజీ సమస్య, మరియు ప్రభుత్వ పథకాలు అందడం లేదని, పెన్షలు ఎత్తివేశారని చెప్పి అక్కడ ప్రజలు బాధపడుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బిల్లిపోగు చంటి, మండల కమిటీ సభ్యులు పి.రమేష్, రుద్రవరం నుండి యం.రమేష్, కుదప గ్రామంనుండి మణికంఠ, కూనపరాజుపర్వ నుండి శేషగిరి, సాంబశివరావు, మద్దులపర్వ నుండి యం.రమేష్, గఫార్, రాజశేఖర్, అశోక్, జాఫర్, ప్రసన్న, కార్తీక్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-2.41.49-PM-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-2.41.50-PM-1024x477.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-26-at-2.41.51-PM-1-1024x477.jpeg)