ఖమ్మం జిల్లాలో సైతం జనసేన పోటీకి సిద్ధం: రామకృష్ణ మిర్యాల

ఖమ్మం నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలి

తెలంగాణ, ఖమ్మం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జ్ రామకృష్ణ మిర్యాల అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలో ప్రెస్ క్లబ్ నందు జనసేన పార్టీ ఖమ్మం నియోజకవర్గం తరుపున నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ రామకృష్ణ మిర్యాల మాట్లాడుతూ.. అన్ని రంగాల ప్రజలు జనసేనకు మద్దతు ఇచ్చి ఖమ్మం నియోజకవర్గంలో జనసేన పార్టీని గెలిపించాలి. మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం గతములో రైతుల రుణమాఫీ కోసం పాదయాత్ర చేయడం జరిగింది. ప్రవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టేందుకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది . ఇంకా ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేయడం జరిగింది . ప్రతి సమస్యను మా నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పరిష్కరిస్తాం . మీ భవిష్యత్తు , మీ బిడ్డల భవిష్యత్తు కోసం మమ్మల్ని మీ బిడ్డగా ఆదరించి జనసేన పార్టీకీ ఖమ్మం నియోజకవర్గంలో మద్దతిచ్చి గెలిపించుకోవాలి అని కోరుకుంటున్నా. అదే విధంగా జగన్మోహన్ మిరియాల మాట్లాడుతూ గతంలో కార్పొరేషణ్ ఎలక్షన్లో ఖమ్మం నగరంలో ఐదు స్థానాలు పోటీ చేయడం జరిగింది ఆ ఐదు స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థులను గెలుపు దిశగా ఓటర్లు ప్రభావితం చేయడం జరిగింది మరోసారి జనసేన పార్టీకీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని ఖమ్మం నియోజకవర్గం యువతరం ప్రజలను కోరడం జరిగింది . నగర అధ్యక్షులు మేడబోయిన కార్తీక్ మాట్లాడుతూ గతంలో కార్పొరేషన్ లో పోటీ చేసిన స్థానాల్లో ప్రజలు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని గుర్తు చేసుకుని ఈసారి సా ర్వత్రిక ఎన్నికల ఖమ్మం ఖమ్మం నియోజకవర్గం లో జనసేన పార్టీ పోటీ చేయడానికి పలైన కారణమని తెలియజేశారు . నగర ప్రధాన కార్యదర్శి యాసంనేని అజయ్ కృష్ణ మాట్లాడుతూ యువతకి ఉద్యోగ ఉపాధి కావాలంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఈ యువత తరఫున జనసేన పార్టీ ప్రభుత్వ పాలకులను ప్రశ్నిస్తుంది, ఒక్కసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీకీ అండగా నిలబడాలని ఖమ్మం నియోజకవర్గం ప్రజలను, యువతను ఈ మీడియా సమావేశంలో కోరడం జరిగింది . జనసేన నాయకులు బండారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.