పిడుగుపాటుతో మరణించిన చిన్నారి కుటుంబానికి జనసేన భరోసా

ఆమదాలవలస నియోజకవర్గము, బూర్జ మండలం, పనుకుపర్తి గ్రామంలో ఇటీవల పిడుగుపాటుతో 13 సంవత్సరాలు చిన్నారి ఢిల్లీశ్వరి (మేఘన) చనిపోయింది, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర మరియు కోరుకొండ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కుటుంబాన్ని పరామర్శించి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో 12 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి, ఎల్లవేళలా జనసేన పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది మరియు ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కూడా అందే వరకు అన్ని విధాలుగా, జనసేన పార్టీ తరుపున అండగా ఉంటామని మాటివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపిటిసి అంపిలి విక్రమ్ మరియు జనసేన పార్టీ నాయకులు రాజేష్, మౌళి, సంఘం నాయుడు, నరేష్, శ్రీను, గణేష్, ఆనంద్, సురేష్, కాశీ కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవడానికి, ముందుకు వచ్చినటువంటి మన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామని అన్నారు.