ఇళ్ళు మంజూరు చేయాలని జనసేన వినతి

పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయుకులు గుంట్రెడ్డి గౌరీశంకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షురాలు అగూరు మణి సమక్షంలో జనసేన నాయకుడు రాజాను బాలు, కృష్ణపల్లి గ్రామాన్ని సందర్శించినప్పుడు ప్రజలు సమస్యలు తెలుసుకోగా వాటిలో కొంతమందికి ప్రధాన సమస్య ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉండి ఇబ్బందిపడుతున్నారు, ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు మాట్లాడుతూ వైస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలు అని గొప్పగా చెప్పుకొనే వాటిలో ఒక్కటైనా పేదలందరికి ఇల్లు అని అర్హత ఉన్నా అందరికి తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి కృష్ణపల్లి గ్రామ పంచాయతీలో అర్హత ఉండి కూడా కొంతమంది ప్రజలకి గ్రామంలో ఇల్లు మంజూరు చేయకపోవడం ఆర్చర్యం వేస్తుంది. ఆ బాధితులు వెంట జనసేన పార్టీ నిలబడి వారి సమస్యను గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలీయజేసి వారికీ ఎలాగైనా ఇల్లు మంజూరు చేయమని చెప్పడం జరిగింది, చేయని యెడల వారి వెంట జనసేన పార్టీ ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, అగూరు శ్రీను, తేజ, పవన్, సాయి, ఉపేంద్ర, హరీష్, ఆ గ్రామ జనసైనికులు, బాధితులు, ప్రజలు పాల్గొన్నారు.