జనసేన గెలుపుకు కృషి చేయాలి: బోగినేని కాశీరావు

ఉదయగిరి నియోజకవర్గం: ఉదయగిరి మండలం, గండిపాలెం, వెంగలరావు నగర్ గ్రామంలోని జనసైనికులను ఉదయగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోగినేని కాశీరావు కలిసి జనసేన పార్టీ బలోపేతం గురించి, జనసేన – టీడీపీ ఉమ్మడి కార్యాచరణ గురించి సంభాషించడం జరిగింది. మన పార్టీని ముందుకు తీసుకు వెళ్తూ టీడీపీతో సమన్వయ పరుచుకుంటూ 2024లో కూటమి గెలుపుకు కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం తప్పక ప్రయత్నిస్తుంది అని భరోసా ఇచ్చారు. జనసైనికులకు, వీరమహిళలకి పార్టీ 100 శాతం అండగా వుంటుంది. ప్రతి కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చి సహకరిస్తానని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షేక్ ఇమ్రాన్, షేక్ అఖిల్, గొల్లపల్లి రమేష్, ఖాలిక్, బన్నీ, మన్సూర్ మరియు సుధాకర్ పాల్గొనడం జరిగింది.