దెందులూరులో సేవా స్పూర్తిని చాటిన జనసేన

*నిరుపేద జనసైనికుడికి కల్పించిన జనసేన పార్టీ

దెందులూరు నియోజకవర్గం పోతునూరు గ్రామానికి చెందిన ఒక నిరుపేద జనసైనికుడు అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న నేపథ్యంలో, ఆయనకు భరోసానిచ్చేలా జనసేన పార్టీ ఉదారతను చాటుకుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ ఇన్‌చార్జి డా. ఘంటసాల వెంకటలక్ష్మి, గ్రామ అధ్యక్షుడు చదరం విద్యాసాయి ఆర్థిక సహకారంతో ఆ కార్యకర్తకు వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ జీవనాధార కేంద్రాన్ని ఘంటసాల వెంకటలక్ష్మి గారు స్వయంగా ప్రారంభించగా, కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ చర్య పార్టీ సేవా తత్వాన్ని, కార్యకర్తల పట్ల చూపుతున్న సంక్షేమ దృక్పథాన్ని స్పష్టంగా చాటుతోంది.

Share this content:

Post Comment