గ్రామసేవకులు చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో జనసేన సంఘీభావం

నూజివీడు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సేవకులు చేస్తున్న నిరసన దీక్ష కార్యక్రమాల్లో భాగంగా నూజివీడు తహశీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సేవకుల చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో జనసేన పార్టీ తరపున పాల్గొని వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. గ్రామ సేవకులు చేస్తున్న న్యాయబద్ధమైన తమ కోర్కెలు హక్కుల సాధన కోసం నిరసన చేయటం అత్యంత బాధాకరం అని కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులు నెరుసు కృష్ణా ఆంజనేయులు తెలియజేశారు. వారు చేసే ప్రతి ఉద్యమానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు యర్రంశెట్టి రాము, నూజివీడు జనసేన పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎం.సునీల్ కుమార్, నూజివీడు పట్టణ నాయకులు ముత్యాల కామేష్, సీపీఐ నూజివీడు నియోజకవర్గ కన్వీనర్ బత్తుల వెంకటేశ్వరరావు, గ్రామ సేవకులు యనమదల శ్రీనివాసరావు తదితర గ్రామసేవకులు పాల్గొన్నారు.