జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాలు వివరణ కోరిన జనసేన

పిఠాపురం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలాలు, ఎంత మంది నివాసం ఏర్పరచుకున్నారు, ఎంత మంది నివాసం మధ్య దశలో ఉంది, ప్రజలకు స్థలాలు ఇవ్వడానికి ఎన్ని ఎకరాలు కొనుగోలు చేశారన్న సమాచారం తెలుసు కోవడానికి పలు పంచాయతీ, గ్రామ సచివాలయాల్లో జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రాడ జనసేన పార్టీ ఎంపీటీసీ దూలపల్లి రత్నం. సచివాలయ సెక్రెటరీకి జగనన్న కాలనీ వివరాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వటం జరిగింది. పిఠాపురం మండల రూరల్ నాయకులు గోపు సురేష్ ఆధ్వర్యంలో విరవాడ గ్రామ సచివాలయంలో జగనన్న కాలనీలో వివరాలు కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రాడ ఎంపీటీసీ దూలపల్లి రత్నం, గోపు సురేష్, దేశ రెడ్డి సతీష్, కంద సోమరాజు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.