క్షేత్ర స్థాయి కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుంది
- జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ
శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో గురువారం ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలియజేయ తలచిన సందర్భంగా వినుత కోటాని గృహ నిర్భంధం చెయ్యడం, జిల్లా కార్యదర్శి కొట్టే సాయిని చెయ్యి చేసుకుని అమానుషంగా పోలీస్ స్టేషన్ కి తరలించిన విషయం అందరికీ విదితమే. ఈ సంఘటనలో బాధితులైన జనసైనికులను పరామర్శించడానికి ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ శ్రీకాళహస్తికి విచ్చేసి, జనసైనికుల ఇంటికి వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అన్ని రకాలుగా క్షేత్ర స్థాయి కార్యకర్తలకు అండగా ఉంటుందని, చెయ్యి చేసుకున్న మహిళ పోలీసు అధికారినిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను ప్రజలు అందరికీ తెలిసేలా చేసిన శ్రీకాళహస్తి మీడియా (సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-7.25.46-PM-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-16-at-7.25.46-PM-1-1024x576.jpeg)