జనసైనికుడు హరీష్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది: వంపూరు గంగులయ్య

  • జనసైనికుడు హరీష్ మరణించినప్పటికీ తన ఆత్మ చేకూరాలి… జనసేన పార్టీ అరకు, పాడేరు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య..

అల్లూరి జిల్లా (చింతపల్లి): జనసైనికుడు హరీష్ గుత్తులపుట్టు సమీపంలో యాక్సిడెంట్ జరిగి కేజీఎచ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో మరణించారు. హరీష్ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంట్టుందని జనసేన పార్టీ అరకు, పాడేరు ఇంచార్జ్ వంపూరు గంగులయ్యా పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతు “జనసేన పార్టీకి విధేయుడిగా ఉండే జనసైనికుడు హరీష్ మృతి కుటుంబానికి, జనసేన కుటుంబానికి తీరని లోటు, దాదాపు హరీష్ రెండువారాలుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులు క్రితం గుత్తులపుట్టు సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. కేజీఎచ్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తంలో కోమాలో ఉండి చావుతో పోరాడి మరణించారు. ఈ విషయం మమల్ని ద్రిగ్బందికి గురిచేసింది. అలాగే జనసైనికులు ఎటువంటి తాపర్య పడొద్దు, హరీష్ తన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసున్నందున హరీష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటున్దని, పార్టీ కేంద్ర కమిటీకి పూర్తి వివరాలను పంపించి, దిశ నిర్దేశాల ప్రయత్నాలు చేస్తూ, జనసేన పార్టీ హరీష్ కుటుంబానికి అండగా ఉండే విధంగా చూస్తానని గంగులయ్య చెప్పారు.