ముత్యాల వెంకటేశ్వరరావుకి అండగా జనసేన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మల్కిపురం మండలం, కేశనపల్లి గ్రామంలో ఇటీవలే బైక్ ప్రమాదంలో వెన్నెముక విరిగి మంచాన పడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ముత్యాల వెంకటేశ్వరరావుకి ఎన్నారై లంకలపల్లి రాజు 50 వేల రూపాయలు, హైదరాబాద్ కు చెందిన బిల్డర్ సూదా గంగరాజు చంటి 30 వేల రూపాయలు కలిపి 80 వేల రూపాయలు రాజోలు నియోజకవర్గం జనసేన నాయకుల ఆధ్వర్యంలో మల్కిపురం మండల అధ్యక్షులు మల్లెపూడి సత్తిబాబు అధ్యక్షతన గ్రామశాఖ అధ్యక్షులు అడబాల నాని సమక్షంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిసాల బాలాజీ, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాడి మోహన్ కుమార్, జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, బోనం సాయి ఉండపల్లి అంజి, రావూరి నాగు, పోలిశెట్టి గణేష్, రాపాక మహేష్ మరియు కేసనపల్లి గ్రామానికి చెందిన జనసేన నాయకులు అడబాల నగేష్, అడబాల వెంకటేశ్వరరావు, బొరుసు బంగార్రాజు, రావూరి త్రినాధ్, ఎర్రంశెట్టి సుబ్బరావు తదితరులు పాల్గొన్నారు.