క్రియాశీల సభ్యుల కుటుంబాలకు అండగా జనసేన

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం,

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , కొత్తపేట నియోజక వర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి నుండి వస్తున్న మనోహర్ కు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం ఈతకోట గ్రామం నుండి సుమారు 2000 వేల మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు ఈ బైక్ ర్యాలీ ఈతకోట నుండి ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం కొత్తపేటలోని బండారు బుల్లి సత్యం చంద్రావతి (కాపు కళ్యాణ మండపం ) నందు కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్
బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేరుకుంది. రావులపాలెం రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా భీమా చెక్ ను అందజేసారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రావులపాలెం మండలం ఈతకోట చేరుకున్న జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు రావులపాలెం మండలం, కొమరాజులంకకు చెందిన అప్పన మహేష్, కొత్తపేట బోడిపాలెంకు చెందిన కొమ్మన వీర వెంకట సత్యనారాయణల కుటుంబ సభ్యులకు పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, కొత్తపేట నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ లతో కలిసి పార్టీ తరుపున రూ.5లక్షల చొప్పున ప్రమాద భీమా చెక్కులు అందజేసారు. ఈ కార్యక్రమంలో పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పంతం నానాజీ, అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.