క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన

కదిరి మండలం, కాలసముద్రము పంచాయితీలో జనసేన పార్టీ కోసం కష్టపడే క్రియాశీలక కార్యకర్త జెరిపిటి శ్రీనివాసులు తండ్రి కీర్తి శేషులు వెంకటదాసు అనారోగ్యం చేత మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ కదిరి మండల అధ్యక్షులు చిల్లా మహేష్ వారి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించి.. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని.. అధైర్య పడవద్దు మేమంతా ఉన్నామని.. అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వీరితో పాటుగా జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, నియోజకవర్గం ఐటి వింగ్ కోఆర్డినేటర్ పొరకల రాజేంద్ర ప్రసాద్, కదిరి నియోజక వర్గం జన సైనికులు సాడగల గణేష్, చలపతి, హరి, సూరి, కేశవ, శ్రీనివాసులు, మధు, గంగరాజు, దేవలం కార్తిక్, కృష్ణకాంత్ వీరి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.