అగ్నిప్రమాద బాధితులకు అండగా జనసేన

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ తుర్రురులో ఆదివారం జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను రంపచోడవరం డివిజన్ జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ అధ్యక్షులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. కుర్ల రాజశేఖర్ రెడ్డి చేతుల మీదగా 10,500/- రూపాయలు ఇవ్వడం జరిగింది. మరియు మారేడుమిల్లి మండల అధ్యక్షులు మల్ల దుర్గాప్రసాద్ ఉపాధ్యక్షులు బీశెట్టి సత్య, అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి దుప్పట్లు, రగ్గు, కూరగాయలు, బియ్యం అందజేయడం జరిగింది. రంపచోడవరం డివిజన్ జనసేన పార్టీ గ్రూపులో సభ్యులు 3800 ఫోన్ పే చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతలు కుటుంబానికి ఎవరన్నా సహాయం చేస్తే వాళ్లు ఉంటే సహాయం ఆంద చేయవలసిందిగా కోరుచున్నామని బాధిత కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు తోడుగా ఉంటదని ప్రభుత్వం వెంటనే పక్కా ఇల్లు నిర్మించాలని ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజవొమ్మంగి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి త్రిమూర్తులు, లోకేష్, గోపి సీత, మళ్లీ, అడ్డతీగల మండలం నాయకులు కుప్పాల జయరాం, పొడుగు సాయి, మణికంఠ, లోకేష్, రాజ్ కుమార్, ధర్మ తేజ, గణేష్, శివ, తేజ మరియు నాయకులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.