అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

సత్యవేడు నియోజకవర్గం: వరదయ్యపాలెం మండలం, పులి వేలం గ్రామ & పంచాయతీలో స్థానికంగా నివసించే పేద దళితుడు నాగేంద్ర ఇల్లు తుఫాన్ కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు కాలిపోయి ఆర్థికంగా నష్టం జరిగింది. ఇది తెలుసుకున్న జనసేన వరదయ్యపాలెం మండలం కమీటీ మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ అధ్వర్యంలో నాగేంద్ర కుటుంబానికి అర్ధిక సాయం మరియు నిత్యావసర సరుకుల అందించడం జరిగింది. శేఖర్ తులసి రామ్ కేశవ్, మండల అధ్యక్షులు చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నుంచి న్యాయం జరిగేలా వరదయ్యపాలెం జనసేన మండల కమిటీ పోరాడుతుంది, అన్ని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగిది. “ఉపఅధ్యక్షలు శేఖర్”, తులసి రామ్ మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు పోరాడి ప్రజలకు ఎక్కడ సమస్య వస్తే ఆసమస్యను పరిష్కరించడానికి జనసేన మండల కమిటీ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. ప్రధాన కార్యదర్శులు కేశవ్, వెంకటేష్ మాట్లాడుతూ ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబని అదుకోవలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి ముని రత్న, మహేష్, సంయుక్త కార్యదర్శి సాగర్, సాయి, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.