విద్యార్థినికి అండగా జనసేన

మైలవరం, ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినికి అండగా నిలిచిన తుమ్మలపాలెం జనసేన పార్టీ కార్యకర్తలు. తన చదువుకు అయ్యే పుస్తకాలకు మరియు ఇతర అవసరాలకు తమ వంతు సహాయంగా గ్రామంలోని కొంతమంది జనసైనికులు కొంత నగదు సేకరించి ఆ విద్యార్థినికి జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి తేజ చేతుల మీదగా విద్యార్థినికి అందించడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో తన ప్రతిభను గుర్తించి ఆ విద్యార్థినికి మరింతగా సహాయం చేసే విధంగా కృషి చేస్తామని ఆ గ్రామ జనసేన పార్టీ వార్డ్ మెంబర్లు చిన్న స్వామి మరియు శ్రీలం నరేష్ హామీ ఇచ్చారు.