రానున్న ఎన్నికల్లో సత్తా చాటే దిశగా జనసేన అడుగులు: బండారు శ్రీనివాస్
- జనసేనాని ఆశయాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరిక
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం,ఆలమూరు మండలం మడికి గ్రామము శుక్రవారం జనసేనా జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి నగేష్ అద్వర్యంలో జనసేన కొత్తపేట నియోజకవర్గం ఇంచార్జీ బండారు శ్రీనివాస్ సమక్షంలో సుమారు 20 మంది పైగా శెట్టిబలిజ సామాజికవర్గం నుండి జనసెన పార్టీలో చేరారు. ఇటీవల కొత్తపేట నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన దూసుకుపోతున్న విధానం, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని బలమైన కోరిక, ఇవన్నీ ఆ పార్టీ వారికే కాక ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికి నూతన ఉత్సాహం కలిగిస్తుందనడంలో అతిశోయోక్తి లేదని నిరూపిస్తున్నాయని, జరిగే పరిణామాలు పార్టీ విజయ కేతనం ఎగరవేయడం కొరకు శుభసూచికలు అన్నారు బండారు శ్రీనివాస్. భవిష్యత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతుంది జనసేన పార్టీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చెల్లుబోయిన మణికంఠ, ఎంపీటీసీ తమ్మన భాస్కరరావు, సలాది జయప్రకాశ్ నారాయణ, ఎంపీటీసీ పడాల అమ్మిరాజు నాగలక్ష్మి, ఎంపీటీసీ ఉండ్రాపు వెంకన్న, పేరపు దుర్గారావు, పంపన సురేష్, మడికి గ్రామ జనసేన ప్రెసిడెంట్ గంగరాజు, కొత్తపల్లి బుజ్జియ, ఉండ్రాపు విజయ్ కుమార్, ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-09-at-20.39.00-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-09-at-20.38.59-1024x576.jpeg)