కార్యకర్తకు అండగా నిలిచిన జనసేన

  • 2,50,000 రూపాయల చెక్ ని అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపెల్లి నియోజకవర్గ పరిధిలో ప్రమాదం జరిగిన కార్యకర్తకు ప్రమాద భీమా 2,50,000/- రూపాయల చెక్ ని రాష్ట్ర నాయకులు దామోదర్ రెడ్డి, కావ్య, శిరీష, మూల హరీష్ గౌడ్, సతీష్, రాజేష్, మాధవరెడ్డి ల చేతుల మీదుగా ప్రమాదంలో గాయపడ్డ పవన్ కళ్యాణ్ అనే కార్యకర్త కుటుంబానికి జిల్లా నాయకులతో పాటు అందజేయడం జరిగింది. అనంతరం జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఇంచార్జి శంకర్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు యువత జాగ్రత్త వహించాలి అని, కార్యకర్తలకు జనసేన పార్టీ మరియు అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలియజేసారు. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన జగిత్యాల నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్త భూపతి మధుకి 23000/- రూపాయల చెక్ ని రాష్ట్ర ఇంచార్జి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తల క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన వలంటీర్స్, రాసురి హరి (పెద్దపల్లి) బెక్కం జనార్దన్ (జగిత్యాల) మరియ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు, శివారెడ్డి చల్లా, రావుల మధు, హుస్నాబాద్ కో ఆర్డినేటర్ తగరపు శ్రీనివాస్, కందుల రాజిరెడ్డి, పైసా మోజేష్, గగన్ కుమార్, విశ్వజ్ఞ చారి, బాలరాజు, అరవింద్, శ్రీనివాస్, ప్రసాద్ గౌడ్, పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు మడగొండ అజయ్, సాయి, శివ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.