నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా జనసేన కృషి

తూర్పుగోదావరి, 2019లో రాష్ట్రం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సుమారుగా 90 మంది రైతులు వారికి ప్రభుత్వం ద్వారా ఇప్పటికీ ఏ భరోసా కల్పించలేదు. ఆ విషయం తెలిసిన జనసేన పార్టీ ద్వారా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం బాధిత రైతు కుటుంబాలను తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ నేతృత్వంలో పార్టీ బృందాలు పరామర్శించి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాయి. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామంలో కీర్తిశేషులు ద్వారంపూడి నర్సిరెడ్డి ఇలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించి వారి దగ్గర నుంచి ఆధారాలు తీసుకుని ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులకి నివేదిక ఇవ్వనున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తారు.