విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవం దక్కేలా జనసేన కృషిచేస్తుంది: వాసగిరి మణికంఠ

గుంతకల్, శ్రీ చైతన్య విభిన్న ప్రతిభావంతుల మండల సమాఖ్య వారు గుంతకల్ పట్టణం స్థానిక ఆర్డిటి ఆఫీసులో నిర్వహించిన “అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం”నకు ముఖ్యఅతిథిగా గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో గౌరవం దక్కేలా మరియు వారి సమస్యలను జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి జనసేన పార్టీ అండగా ఉండేలా కృషి చేస్తుందని భరోసాని ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని. మీకు సంబంధించిన వైకల్య ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందేలా మరియు మీ సామాజిక భద్రతా పెన్షన్ పెంచే విధంగా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విభిన్న ప్రతిభావంతులు, శ్రీ చైతన్య విభిన్న ప్రతిభావంతుల మండల సమాఖ్య నాయకులు, ఆర్డిటి సిబ్బంది తదితరులు హాజరయ్యారు.