జనసేన నాయకుల అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన పిడుగురాళ్ల జనసేన

గురజాల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో భాగంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి వెళ్ళిన లక్షలాదిమంది జన సమూహాన్ని చూసి ఓర్చుకోలేక జానవాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే వీళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఈ వైసీపీ ప్రభుత్వం, ప్రజల దృష్టిని మళ్లించడానికి మంత్రులపై దాడి అనే నాటకాన్ని తెరపైకి తెచ్చి, జనసేన నాయకులను అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని జనసేన పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ అన్నారు. జనసేన అంటేనే జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని అందుకే ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారని, మీరు ఎన్ని ఇబ్బందులు కలుగజేసిన ప్రజల పక్షాన జనసేన ఎప్పుడూ పోరాడుతుందని, అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాశిం సైదా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు దూదేకుల శ్రీను, మండల ఉపాధ్యక్షులు పెడకొలిమి కిరణ్ కుమార్, బయ్యవరపు రమేష్, మండల ప్రధాన కార్యదర్శులు షేక్ మదీన, చీదేళ్ల రామకృష్ణ, ఆవుల రమేష్, కార్యదర్శిలు గఫూర్, బెతంచెర్ల ప్రసాద్, అంబటి సాయి, పవన్ తదితరులు పాల్గొన్నారు.