బాలికపై అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ

నిర్మల్ జిల్లా, కుబీర్ మండలం, నిగ్వా గ్రామంలో మంగళవారం పట్ట పగలే 60 సంవత్సరాల వృద్దుడు అదే గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి లొంగదిసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. పేద మధ్య తరగతి కుటుంబానికి చెందిన అభం శుభం తెలియని ఆ బాలిక తల్లితో జరిగిన విషయాన్ని చెప్పడంతో గ్రామస్థులతో కలిసి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాని పోలీసులు స్పందించక పోవడంతో గ్రామస్థులంతా ఏకమై న్యాయం జరిగే వరకు కదిలేది లేదని అక్కడే కూర్చున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు అక్కడికి చేరుకొని బాధితురాలి తల్లితో జరిగిన విషయాన్ని తెలుసుకొని తీవ్రంగా ఖండించారు. వెంటనే నిందుతుడిని చట్టం ప్రకారం ఫోక్స్, అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని, అదేవిధంగా భాదిత కుటుంబానికి 25లక్షల రూపాయలు, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం సౌకర్యం కల్పించి.. పోలీస్ కస్టడీలో నుండి విడిపించి ఆ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ యంత్రాంగం షీ టీమ్స్ లను అప్రమత్తం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.