ఆమదాలవలస పట్టణంలో జనసేన పోరుబాట

ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు ఆమదాలవలస పట్టణంలో ఆదివార భారీ ర్యాలీ చేపట్టారు. గడిచిన ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి రాగానే మూతపడ్డ ఆమదాలవలస చక్కెర కర్మాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చి, మూడేళ్ల పాలన గడిచినప్పటికీ, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అధికార నాయకులకు గుర్తు చేసేలా నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ… హామీలను నెరవేర్చని పక్షంలో రాజకీయ సన్యాసం చేస్తానని పలికిన సభాపతి తమ్మినేని సీతారాం వాగ్ధానాలను గుర్తు చేశారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ రావు స్థానికంగా ఉన్న ఇరు పార్టీల నాయకులు ఆమదాలవలస నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికార వైయస్ఆర్ పార్టీ తీరుతో రాష్ట్రం అంధకారంలోనికి నెట్టివేయబడుతుందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లడం కేవలం జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.