జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన జనసేన

విజయనగరం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు డొల రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

జనసేన నాయకుడు అదాడా మోహన్ రావు పై తప్పుడు కేసు పెట్టి, పోలీసు వారిని తప్పుదోవ పట్టిస్తూ.. మా నాయకుడు పరువు భంగం కలిగించినందుకు, వశి పార్వతి పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటారని వైయస్సార్సీపి రాజకీయ పార్టీ ద్వారా సర్పంచ్ గా ఎన్నికయ్యాను అని చెబుతూ.. వశి పార్వతి విజయనగరం జిల్లా, జామి మండలం జాగారం గ్రామం, పంచాయతీ నిధులను దుర్వినియోగ పరుస్తూ.. గ్రామ అభివృద్ధి.. సంక్షేమం పట్టించుకోకుండా.. తన పరిధిలో ఉన్న అధికారులను బెదిరిస్తూ.. నిధులు దుర్వినియోగ పరుస్తూ.. ఉన్నారని జాయింట్ కలెక్టర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెపై విచారణ జరిపి చెక్ పవర్ రద్దు చేసి.. సర్పంచ్ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జనసేన పార్టీ విజయనగరం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డొల రాజేంద్ర ప్రసాద్ కోరారు.