మున్సిపల్‌ కార్మికుల న్యాయపోరాటానికి జనసేన మద్దతు

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్మికులను పర్మినెంట్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా గురువారం జనసేన పార్టీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్లపై యాత్రలు చేస్తున్న సమయంలో ఎలక్షన్ సమయంలో ఈ కార్మికులు అందరినీ పర్మినెంట్ చేస్తా అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అని మాట ఇచ్చిన ఈ జగన్ రెడ్డి గారు ఇప్పుడు మడమ తిప్పుతున్నాడు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయింది కానీ వీరికి న్యాయం మాత్రం చేయలేదు. ఈ కార్మికులు మున్సిపాలిటీలో రోజువారి పనులు చేయకుండా ఆపేస్తే మన పరిస్థితి ఎంత అద్వానంగా ఉంటుందో తెలియదా జగన్ రెడ్డి గారు.. జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం మీరు అధికారంలో వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది అయినా వీరిని మోసం చేస్తూ ఇంకా వీరికి న్యాయం చేయక చేయకపోతే మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తంలో కార్మికులతో కలసి మేమందరం రోడ్డెక్కి నీ తాడేపల్లిలో ఉన్న ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నామని గాదె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.