అనారోగ్యంతో ఉన్న సత్యవతికి జనసేన అండ

*మూలపేటలో ఆర్థిక సాయం అందించిన నాయకులు

పిఠాపురం నియోజకవర్గం, యు కొత్తపల్లి మండలంలోని మూలపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రిక్క సత్యవతిని బుధవారం జనసేన నాయకులు పరామర్శించారు. గ్రామంలోని మార్కెట్ షెడ్ వద్ద ఆమె కుటుంబాన్ని కలిసి మానసికంగా ఆదరిస్తూ, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు, నాయకులు కాకాడ శ్రీనివాస్, వీవర్స్ సొసైటీ ప్రెసిడెంట్ సిద్ది మురళి, మేరుగు లక్ష్మణ్, సిద్ది నాగు, వీరమహిళ ఎక్స్ ఎంపీటీసీ ముప్పిడి అప్పయ్యమ్మ పాల్గొన్నారు. పార్టీ తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. జనసేన నేతల ఈ ఉదాత్త చర్య ప్రజల్లో హృద్యంగా నిలిచింది.

Share this content:

Post Comment