అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నిరాహార దీక్షకు జనసేన మద్దతు

విజయనగరం: నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ., అంగన్వాడీ ఉద్యోగులకి జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాలికి వదిలేశారని చేస్తున్న నిరాహార దీక్షకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి, తదితరులు జనసేన తరఫున సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జనసేన తరఫున తమ వంతుగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని తమ ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మోపడ అనిల్ కుమార్, దాసరి యోగేష్, కొర్నాన రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.