నంద్యాలలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

  • నంద్యాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి జనసేన మద్దతు
  • రాష్ట్రా భవిష్యత్తూ కోసం టిడిపితో పొత్తు
  • జనసేన నాయకులు రాచమడుగు సుందర్, చందు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు తీరును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేపడుతున్న నిరసన కార్యక్రమానికి నంద్యాల జిల్లా జనసేన నాయుకులు రాచమడుగు సుందర్, చందు సంఘీభావం తెలియజేసారు. ఈ నిరసనకార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్, మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కష్టకాలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గుర్తించాలన్నారు. సమర్థతలేని పాలకులు చేతిలో రాష్ట్రం ఆదోగతి పాలయ్యిందనిమండిపడ్డారు. వ్యవస్థలన్నీ చిన్న భిన్నం అయ్యాయని, కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అందుకే జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు టిడిపితో పొత్తు ప్రకటించారన్నారు. ఇకపై నంద్యాల జిల్లాలో టిడిపి, జనసేన పార్టీలు రెండు కలిసి పని చేస్తాయని తెలిపారు.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల పక్షాన ఉమ్మడి పోరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సాయి ప్రదీప్ రెడ్డి, ఫక్రుద్దీన్, ఫారుక్, చిన్న, రవి, అభి, ఫ్రాన్సిస్, మాబు హుస్సేన్, లోకేష్, జీవన్, గిరి, అశోక్, సాయి, సుంకన్న, మల్లికార్జున, మధు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.