దొడగట్టలో ఇంటింటా జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ప్రచారం

కళ్యాణదుర్గం నియోజకవర్గం: జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకి మద్దతుగా శనివారం కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ పరిధిలో దొడగట్టలో ఇంటింటా ప్రచార కార్యక్రమంలో అమిలినేని యశ్వంత్ & అమిలినేని సురేంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి జనసేన-టిడిపి ఇంటింటా ఉమ్మడి ప్రచారం నిర్వహించడం జరిగింది. 114 చెరువులకు నీరు తీసుకువచ్చి తీసుకువచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేసుకొని స్థానికంగా యువతకు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ కల్పన చేయటం జరుగుతుంది అని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీ నరసయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు సీ పీ. వంశీకృష్ణ, కళ్యాణ దుర్గం మండల అధ్యక్షులు జాకీర్ హుసేన్, కళ్యాణ దుర్గం మండలం ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కళ్యాణదుర్గం, జనసేన వీరమహిళల ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, కళ్యాణ దుర్గం ముఖ్యనాయకులు రాజు, అనిల్ పాళ్యం, దొడగట్ట ముఖ్యనాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.