అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొన్న జనసేన, టిడిపి

కురుపాం నియోజకవర్గం: గరుగుబిల్లి మండలం, కొంకిడివరం గ్రామం పరిధిలో ఓ ప్రైవేటు క్వారీకి లబ్ది చేకూర్చే విధంగా ఎన్.ఆర్.ఈ.జి నిధుల నుంచి ఐ.టి.డి.ఏకి దారి మళ్లించి అక్రమంగా 2 కోట్ల రూపాయలుతో నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కురుపాం నియోజకవర్గం జనసేన పార్టీ మరియు టిడిపి పార్టీ అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల కార్యదర్శి బాబు పాలూరు మరియు కురుపాం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి తోయక జగదీశ్వరి, కురుపాం నియోజకవర్గం జనసేన నాయకులు నేరాడుబిల్లి వంశీ, గార గౌరీ శంకర్రావు, ఐటీవింగ్ లచ్చిపాతుల రంజిత్, మండల అధ్యక్షులు తెంటూ శ్రీకర్, జిల్లా కార్యనిర్వహన కార్యదర్శి పెంట శంకర్ రావు, కిల్లనా అనంత కుమార్, దత్తి శంకర్ రావు, పల్లి శ్రీకాంత్, భార్గవ్, ధర్మ, మరియు టీడీపీ నాయకులు డొంకడా రామకృష్ణ, ఎం పి నాయుడు, మండల అధ్యక్షులు అక్కెన మధు, కృష్ణబాబు మరియు టీడీపీ నాయకులు, జనసేనసైనికులు, కొంకిడివరం సర్పంచ్ అల్లు అప్పలనాయుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.