బస్కి పంచాయతీలో జనసేన పర్యటన
జనసేన మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, మాదాల శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ తదితరులు
అరకు నియోజకవర్గ కేంద్రం, బస్కి పంచాయితీ తదితర గ్రామాల్లో జనసేన బృందం మంగళవారం సాయంత్రం పర్యటించనున్నట్లు జనసేన పార్టీ మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా, శ్రీరాములు, అల్లంగి రామకృష్ణ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన మాటలు జనంలోకి తీసుకెళ్లే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు జనంలోకి తీసుకెళ్లి ప్రభుత్వ తీరు ను బహిర్గతం చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో నిర్మాణం బలోపేతం చేసే దిశగా.. జనసేన మాటలు, జనసేన సిద్ధాంతాలు పూర్తిస్థాయిలో గిరిజనులకు అందేలా, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెలికి తీసే వాటి సమస్య కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, గిరిజనులకు జనసేన పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని భరోసా ఇవ్వగలమని వారిని సూచించే కార్యచరణ భాగంగా ఈ పర్యటనను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-01-at-6.26.08-PM-1024x575.jpeg)