జనసేన – తెలుగుదేశం సమన్వయ సమావేశం

* మధ్యాహ్నం 1 గం.కు రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్
జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ సమావేశం సోమవారం రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఇరు పార్టీలు పొత్తు ప్రకటన అనంతరం.. సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి సభ్యులను నియమించారు.ఈ కమిటీ తొలి సమావేశం విజయదశమి రోజున రాజమండ్రిలో ఏర్పాటైంది. మధ్యాహ్నం 3 గం.కు మంజీర హోటల్లో ఈ సమావేశం ఉంటుంది. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు సోమవారం మధ్యాహ్నం 1గం.కు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సమావేశం జరిగే హోటల్ కు వెళ్తారు.